Wednesday 4th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసింది

ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసింది

Ys Sharmila On Gudlavalleru College Incident | గుడివాడ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ( Gudlavalleru Engineering College )లో రహస్య కెమెరాల ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఆడపిల్లల బాత్ రూముల్లో రహస్య కెమెరాలు, 3వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోపించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( Ys Sharmila ).


గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు.

కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యం అని పేర్కొన్నారు.ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు, ఫాస్ట్రాక్ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.


రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేన్నారు.

బాత్ రూముల్లో రికార్డ్ ( Record ) అయిన ఏ వీడియో ( Video ) కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు షర్మిల విజ్ఞప్తి చేశారు.


వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే తానే కాలేజీని సందర్శిస్తానని ఎక్స్ ( X )వేదికగా వైఎస్ షర్మిల పోస్ట్ చేసారు.

You may also like
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
వైఎస్ భారతి పై అసభ్య వ్యాఖ్యలు..వైఎస్ షర్మిల ఏమన్నారంటే !
‘విశాఖ స్టీల్ పై ప్రధాని ఫార్ములా సైలెంట్ కిల్లింగ్’
‘జనసేనను ఆంధ్ర మతసేన గా మార్చారు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions