Wednesday 18th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > భస్మ హారతిలో పాల్గొన్న విరాట్ కోహ్లీ

భస్మ హారతిలో పాల్గొన్న విరాట్ కోహ్లీ

Virat Kohli chants ‘Jai Shree Mahakal’ during visit to Mahakaleshwar Temple | టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ లోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ‘జై శ్రీ మహాకాల్’ అని మీడియా ప్రతినిధులను, అభిమానులను పలకరించారు. ఇందౌర్ వేదికగా ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున విరాట్ కోహ్లీ, బౌలర్ కుల్దీప్ యాదవ్ మరియు టీం ఇండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు.

మహాకాళేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భస్మ హారతిలో పాల్గొన్నారు. ఇకపోతే భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచులో విజయం సాధించాయి. మూడవ మ్యాచ్ ను గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకోనుంది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions