Friday 20th February 2026
12:07:03 PM
Home > తాజా > మహిళలకు ఉచిత ప్రయాణంలో కీలక మార్పు.. ఇక మరింత సులభం!

మహిళలకు ఉచిత ప్రయాణంలో కీలక మార్పు.. ఇక మరింత సులభం!

Smart Cards for Free Bus Journey | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో కీలక మార్పు రానుంది.

ఇప్పటివరకు గుర్తింపు కోసం వాడుతున్న ఆధార్ కార్డుల స్థానంలో ప్రభుత్వం ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను’ ప్రవేశపెట్టనుంది. మార్చి 1 నుంచి ఎంపిక చేసిన కొన్ని మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్డులను జారీ చేయనున్నారు.

నకిలీ ఆధార్ కార్డులతో ఇతర రాష్ట్రాల మహిళలు ఉచిత ప్రయాణం చేయకుండా అరికట్టడం ఈ కార్డుల ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్ కార్డుల్లో ఉండే చిప్ సహాయంతో కండక్టరు కొత్త ఇంటలీజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ ద్వారా సులభంగా జీరో టికెట్లను జారీ చేయవచ్చు.

ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ఏయే రూట్లలో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారో ప్రభుత్వం కచ్చితంగా ట్రాక్ చేయగలదు. మహిళలు ఆన్‌లైన్ ద్వారా లేదా నిర్దేశిత కేంద్రాల్లో ఆధార్ కార్డు, ఫోటో సమర్పించి ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఈ కార్డుల వల్ల మరింత పారదర్శకత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక, జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీ చేసే అవకాశం ఉంది.

You may also like
carlos turcios comments on hanuman statue
టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై అమెరికన్ సంచలన వ్యాఖ్యలు!
Fire breaks out at Aditya Enclave
HYD- అమీర్ పేట్ లో అగ్ని ప్రమాదం!
bhatti vikramarka
‘బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో మా పాల‌న కొన‌సాగుతుంది’
cm revanth
కార్బన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions