Srisailam Project Plunge Pool | శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదాపు అంచున ఉంది, తక్షణ చర్య అవసరమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ( National Dam Safety Authority ) స్పష్టం చేసింది.
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దిగువన గొయ్యి ఏర్పడింది. శ్రీశైలం డ్యామ్ పునాది 380 అడుగులు ఉండగా ఈ గొయ్యి మాత్రం దాదాపు 410 అడుగులు ఉన్నట్లు గతంలో నిర్వహించిన హైడ్రో గ్రాఫిక్ సర్వే ద్వారా వెల్లడైంది.
మే నెలాఖరు వరకు గొయ్యిని పూడ్చాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. డ్యామ్ నుండి నీరు విడుదలయ్యే ప్రాంతంలోనే ఈ గొయ్యి ఏర్పడింది. అయితే గతేడాదే గొయ్యిపై నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోవడంలో ఆలస్యం పట్ల అథారిటీ సీరియస్ అయ్యింది. వర్షాకాలంలో ఇది మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది.