Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > కర్ణాటక ముఖ్యమంత్రితో రాం చరణ్

కర్ణాటక ముఖ్యమంత్రితో రాం చరణ్

Ram Charan meets Karnataka Chief Minister Siddaramaiah in Mysuru | గ్లోబల్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ నిమిత్తం మైసూర్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు.

మైసూర్ లోని నివాసంలో సీఎంను రాం చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మరియు ఎమ్మెల్సీ యతింధ్రా సిద్ధరామయ్య కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా రాం చరణ్ ను ముఖ్యమంత్రి సన్మానించారు. కాసేపు ఇరువురు ముచ్చటించుకున్నారు.

శనివారం అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణించారు. ఈ క్రమంలో రాం చరణ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. పెద్ది షూటింగ్ లో పాల్గొనేందుకు ఆయన తిరిగి మైసూర్ వెళ్లారు.

దర్శకుడు బుచ్చి బాబు పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఇందులో రాం చరణ్ సరసన ఝాన్వీ కపూర్ నటిస్తున్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions