Saturday 14th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మెగాఫ్యామిలీలో చిరంజీవి తర్వాత నాగబాబు?..పవన్ మంతనాలు

మెగాఫ్యామిలీలో చిరంజీవి తర్వాత నాగబాబు?..పవన్ మంతనాలు

Rajyasabha Seat For Nagababu ?| జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు ( Mega Brother Nagababu )కు సంబంధించి ఒక వార్తా ఆసక్తిని రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో కూటమిలో భాగంగా ఇందులో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో నాగబాబును రాజ్యసభకు పంపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి.

ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం తో ఇదే విషయంపై చర్చినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ నాగబాబు రాజ్యసభకు ఎంపికైతే మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) తర్వాత ఆ ఫ్యామిలీలో ఈ ఘనత సాధించిన రెండవ వ్యక్తిగా ఆయన నిలుస్తారు.

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, 2009 ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేసి 18 శాతం ఓట్లను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి కేంద్రమంత్రిగా సేవలందించారు.

You may also like
భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి.. విమాన ప్రమాదంలో కన్నీటి గాథలు!
plane crash
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మేడే కాల్ ఇచ్చిన పైలట్లు!
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions