Saturday 28th February 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > శ్రీశైలంలో ప్రధాని..ఒకే హెలికాప్టర్ లో మోదీ, బాబు, పవన్

శ్రీశైలంలో ప్రధాని..ఒకే హెలికాప్టర్ లో మోదీ, బాబు, పవన్

PM Modi Srisailam Tour | ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన కొనసాగుతుంది. గురువారం ఉదయం కర్నూలు విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.

అనంతరం ఈ ముగ్గురు ఒకే హెలికాప్టర్ లో శ్రీశైలం బయలుదేరారు. అనంతరం శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని ప్రధాని దర్శించుకున్నారు.

ఆ తర్వాత శివాజీ దర్బార్ హాల్, ధ్యాన కేంద్రాన్ని ప్రధాని తిలకించారు. ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే ‘సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions