Friday 13th February 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బంగ్లాదేశ్ ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ

బంగ్లాదేశ్ ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ

PM Modi Congratulates BNP’s Tarique Rahman | బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిన విషయం తెల్సిందే. షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత ఫిబ్రవరి 12న ఆ దేశంలో ఎన్నికలు జరిగాయి. రెండు దశాబ్దాలకు పైగా ప్రతిపక్షంలో కొనసాగుతున్న ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ’ భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండింట మూడవ వంతు సీట్లను ఈ పార్టీ గెలవనునట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీఎన్పీ ఛైర్మన్ తారిక్ రెహమాన్ ను అభినందించారు.

బంగ్లాదేశ్ ప్రజల విశ్వాసాన్ని ఈ ఫలితాలు ప్రతిభింభిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కు భారత మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 350 స్థానాలున్న ఆ దేశ పార్లమెంటులో ఇప్పటికే బీఎన్పీ 210 స్థానాలకు పైగానే గెలిచింది. మరోవైపు మత ఛాందస్స రాజకీయాలకు పేరొందిన జమాత్-ఎ-ఇస్లామీ మరియు మిత్రపక్షాలు కలిసి 71 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

You may also like
మున్సిపల్ ఫలితాలు..సీఎం రేవంత్ కు ప్రియాంక అభినందనలు
ఆస్ట్రేలియాను చిత్తుచేసిన పసికూన
వాలెంటైన్స్ డే..వలపు వలలో పడొద్దు!
కోవా బన్ వివాదం..ఇంకా మానవత్వం మిగిలే ఉంది

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions