Sunday 15th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రూ.2 కోట్ల విరాళం ఇచ్చి..సభ్యత్వం తీసుకున్న పవన్

రూ.2 కోట్ల విరాళం ఇచ్చి..సభ్యత్వం తీసుకున్న పవన్

Pawan Kalyan launches Jana Sena membership drive | జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

150 మందితో పార్టీని ప్రారంభించి 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90 వేలు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఆ సంఖ్య ఆరు లక్షలకు చేరిందని ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించినట్లు సంతోషం వ్యక్తం చేశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునే వారు, చదువుకున్న వారు ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని పవన్ హర్షం వ్యక్తం చేశారు.

You may also like
‘లంబాడా సోదరులు నాకు అండగా నిలబడ్డారు’
కుల రహిత గ్రామంగా ఏకగ్రీవ తీర్మానం
గంగా పునరుజ్జీవం..డాల్ఫిన్ల సందడి!
కుక్కపిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions