MLA Sravani Sree | ఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శింగనమల ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి శ్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలవడానికి వచ్చే కార్యకర్తలకు, నాయకులకు కీలక సూచన చేశారు.
కలవడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలు, పూల దండలు, కేకులు కాకుండా చదువుకునే పిల్లలకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ మేరకు నియోజకవర్గంలో పోస్టర్లను పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రావణి శ్రీ, వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు పై 8 వేల పైచిలుకు ఓట్ల మెజారిటితో గెలిచారు.










