Saturday 31st January 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘ఫిట్నెస్ టెస్ట్ పాస్..ఐపీఎల్ లోకి నితీష్ కుమార్ రెడ్డి’

‘ఫిట్నెస్ టెస్ట్ పాస్..ఐపీఎల్ లోకి నితీష్ కుమార్ రెడ్డి’

Nitish Reddy Cleared to Play IPL 2025 | గాయాల కారణంగా పలువురు స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడడం పై సందిగ్దత నెలకొంది. ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో అనేదానిపై ఇంకా ఓ స్పష్టత రాలేదు.

అలాగే మరికొందరు స్టార్ ఆటగాళ్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో ఇంగ్లాండ్ తో టీ-20 సిరీస్ సందర్భంగా గాయపడిన ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ లో ఆడడం ఖాయమయినట్లు తెలుస్తోంది.

ఇంగ్లాండ్ తో రెండవ టీ-20 కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నితీష్ పక్కటెముకల గాయం బారిన పడ్డారు. దింతో అతను ఇంగ్లాండ్ తో జరిగిన టీ-20, వన్డే సిరీస్ కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీష్ ఆడుతారా అనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి.

కానీ నితీష్ కు బీసీసీఐ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరిగిన ఫిట్నెస్ టెస్టును నితీష్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. అలాగే యో-యో టెస్టు కూడా పాస్ అయినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ క్రమంలో ఐపీఎల్ లో ఈ స్టార్ ఆల్ రౌండర్ ఆడడం ఖాయమైంది. గతేడాది జరిగిన మెగా ఆక్షన్ కంటే ముందు నితీష్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.6 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెల్సిందే.

You may also like
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions