Saturday 28th February 2026
12:07:03 PM
Home > తాజా > ‘రెడ్డిలంతా కలిసి బీసీలను తొక్కేస్తున్నారు’

‘రెడ్డిలంతా కలిసి బీసీలను తొక్కేస్తున్నారు’

Minister Konda Surekha Controversy | మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం అర్ధరాత్రి మంత్రి ఇంటివద్ద హై డ్రామా నెలకొన్న విషయం తెల్సిందే. మాజీ ఓఎస్డీ సుమంత్ ను అదుపులోకి తీసుకోవడానికి మఫ్టీలో పోలీసులు రాగా వారితో సుష్మిత వాగ్వాదానికి దిగారు.

ఇంటి లోపలికి అనుమతించేదే లేదని ఖరా ఖండిగా చెప్పారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాతూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు వేం నరేందర్ రెడ్డి కలిసి తమ కుటుంబం మీద కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తన నాన్న కొండా మురళిని అరెస్ట్ చేసి, అమ్మను మంత్రి పదవి నుండి పీకేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలోని రెడ్డిలు అంతా కలిసి బీసీలను తొక్కేస్తున్నారని బాంబు పేల్చారు.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions