Thursday 22nd May 2025
12:07:03 PM
Home > తాజా > పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక యజమాని ఆత్మహత్య!

పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక యజమాని ఆత్మహత్య!

Man , upset at his dog’s desth , Ends life | బెంగళూరులో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేని యజమాని తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే నగరానికి చెందిన రాజశేఖర్(33) అనే వ్యక్తి నగరంలోని హెగ్గడదేవనపురలో నివాసం ఉంటున్నాడు.

ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి బౌన్సీ అని పేరు పెట్టి సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నాడు. అయితే ఇటీవల అది అనారోగ్యంతో చనిపోయింది.

దీంతో ఖననం చేసిన అనంతరం ఇంటికి వచ్చిన రాజశేఖర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తను ఆప్యాయంగా పెంచుకున్న బౌన్సీ మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ బాధతో కుక్కకు ఉపయోగించిన చైన్‌తోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

You may also like
‘అమెరికా మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ జరిగిందా?’
Sajjanar
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!
pawan kalyan
నేటి నుంచి వాళ్లను అలా పిలవొద్దు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి!
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions