Thursday 8th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకోబోయేది ఎవరంటే !

మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకోబోయేది ఎవరంటే !

Maharastra Assembly Elections Exit Polls | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి.

అధికార బీజేపీ ( BJP ), శివసేన ( Shivasena ), ఎన్సీపీ ( NCP ) కూటమి మహాయుతి, ప్రతిపక్ష కాంగ్రెస్ ( Congress ), శివసేన ఉద్ధవ్ ( Shivasena UBT ), ఎన్సీపీ శరద్ పవార్ ( NCP Sharad Pawar ) మహా వికాస్ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్నికలు ముగియడంతో ఏక్సిట్ పోల్స్ వెలువడుతున్నాయి.

ఇందులో మహారాష్ట్రలో మరోసారి అధికార మహాయుతి కూటమి అధికారాన్ని కైవసం చేసుకొనున్నట్లు సర్వేలు వెల్లడించాయి. పీపుల్ పల్స్ సర్వే ప్రకారం బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి 182, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమికి 97 మరియు ఇతరులకు 9 సీట్లు వస్తాయని అంచనా వేశారు.

మహాయుతిలో బీజేపీ, మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్ పార్టీలు అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటాయని సర్వేలు వెల్లడించాయి. కాగా మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి.

You may also like
‘కుటుంబ సభ్యుల మృతి..భారత్ కు వార్నింగ్ ఇచ్చిన ఉగ్రవాది’
‘ఆపరేషన్ సింధూర్..ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్’
ధర్మశాల ఎయిర్పోర్ట్ క్లోజ్..’ముంబయి ఇండియన్స్’ పై ఎఫెక్ట్
‘హనుమంతుడి లంకా దహణమే మన ఆదర్శం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions