Karnataka minister offers to become suicide bomber in a war on Pakistan | కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకులు జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇస్తే తాను పాకిస్థాన్ తో యుద్ధం చేయడానికి సిద్ధమని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను ముస్లింని, కానీ దానికంటే ముందు భారతీయుడ్ని. పాకిస్థాన్ మనకు చిరకాల శత్రువు.
పాక్ తో ఎలాంటి సంబంధాలు లేవు. ఒకవేళ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇస్తే పాక్ తో యుద్ధం చేయడానికి నేను సిద్ధం. మోదీ, అమిత్ షా నాకు ఒక సూసైడ్ బాంబు ఇస్తే దాన్ని శరీరానికి చుట్టుకుని పాకిస్థాన్ పై దాడి చేయడానికి కూడా సిద్ధమే.
నేను సరదాగా మాట్లాడడం లేదు, దేవుడి మీద ఒట్టు’ అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో మంత్రి జమీర్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు.










