Monday 9th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మనం టీడీపీ వెనుకాల నడవడం లేదు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

మనం టీడీపీ వెనుకాల నడవడం లేదు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

pawan kalyan
  • తెలంగాణ ఓటింగ్ శాతంపై జనసేనాని అసంతృప్తి

Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చెసారు. శుక్రవారం  మంగళగిరి లోని జనసేన (Janasena) కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ (YSRCP) కులాలను విడగొట్టే పని చేస్తుందని, కానీ జనసేన మాత్రం అన్ని కులాలను కలుపుకొని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెలిపారు.

యువతే పార్టీకి బలం అని పేర్కొన్నారు జనసేనాని. జనసేన పార్టీకి యువత బలం చూసి బీజేపీ (BJP) పెద్దలే ఆశ్చర్య పోయారని చెప్పారు. అలాగే యువత ఆదరణ చూసే తెలంగాణ లో 8 చోట్ల పోటీ చేసామన్నారు.

దివంగత ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) తెలంగాణ లో పోటీకి దూరంగా ఉందని, కానీ జనసేన పార్టీ పోటీ చేసినట్లు గుర్తుచేశారు.

మరోవైపు జగన్ (YS Jagan) చెప్పిన మూడు రాజధానులు అవ్వని పని అని విమర్శించారు.

జనసేన టీడీపీ వెనుకాల నడవడం లేదని, కలిసి నడుస్తుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

అలాగే హైదరాబాద్ లో యువత ఓటింగ్ కు దూరంగా ఉండటం బాధించిందని పేర్కొన్నారు జనసేన అధినేత.

You may also like
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!
TG సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి నెలకు రెండుసార్లు..!
chenab railway bridge
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions