India welcomes meet between Trump-Putin | ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా మరో కీలక అడుగు పడింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15న అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య భేటీ జరగనుంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది.
అలాస్కాలో సమావేశమయ్యేందుకు అమెరికా, రష్యాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఉక్రెయిన్ లో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలికి శాంతి నెలకొనేందుకు మార్గం సుగమమం అవుతుందని, ఈ సమావేశం హామీ ఇచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తొలుత పుతిన్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో కలిసి త్రైపాక్షిక భేటీ నిర్వహించాలని ట్రంప్ భావించారు. కానీ భూభాగాల మార్పిడి విషయంలో వివాదం తలెత్తింది. భూభాగా మార్పిడిని అంగీకరించిందే లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు.










