Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > ముస్లింల పేరిట ఎంఐఎం వ్యాపారాలు చేస్తోంది కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన ఆరోపణలు!

ముస్లింల పేరిట ఎంఐఎం వ్యాపారాలు చేస్తోంది కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన ఆరోపణలు!

Feroz Khan On Owaisi | తెలంగాణ ( Telangana ) అసెంబ్లీ ( Assembly ) సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు అక్బరుద్దిన్ ఒవైసి ల మధ్య మాటల యుద్ధం జరిగింది.

అసెంబ్లీ లో ముస్లిం ల గొంతు నొక్కి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని అక్బరుద్దీన్ ( Akbaruddin ) వ్యాఖ్యానించగా, అక్బరుద్దీన్ ని ఒక ముస్లిం నేతగా చూడట్లేదని, కేవలం ఎంఐఎం ( AIMIM ) నేతగానే చూస్తాం అని తెలిపారు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ).

అలాగే గత బీఆరెస్ ( Brs ) పాలనను కీర్తిస్తూ మాట్లాడితే వినడానికి తాము సిద్ధంగా లేమని అక్బరుద్దీన్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం. కాగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ( Feroz Khan ).

అక్బరుద్దీన్ మరియు ఆయన పార్టీ ముస్లిం ( Muslims ) ల పేరు చెప్పుకుని వ్యాపారాలు మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏండ్ల బీఆరెస్ పాలనలో ఒవైసి ( Owaisi ) ఎప్పుడు కూడా మైనారిటీ సమస్యలపై కేసీఆర్ ( Kcr ) ను ప్రశ్నించలేదన్నారు.

ఇక ఎంఐఎం సమయం ముగిసి పోయిందని, ఇప్పుడు ఓల్డ్ సిటీ ( Old City ) అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టం చేశారు ఫిరోజ్ ఖాన్.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’
generative ai services in hyderabad police
పోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions