Cm Revanth Reddy News | ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎం ఆదేశించారు.
ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.