Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీ

ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీ

CM Revanth Reddy News | హైదరాబాద్ లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి అమీర్పేట్ ప్రాంతంలో పర్యటించారు. మైత్రివనం, బల్కంపేటలో ముంపుకు గురైన బస్తీలను, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించారు.

స్థానికుల్ని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపుతామని సీఎం హామీ ఇచ్చారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు.

వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ సహా ఇతర అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions