Tuesday 17th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీ పీఠంపై మహిళ సీఎం.. యోచనలో బీజేపీ అధిష్టానం!

ఢిల్లీ పీఠంపై మహిళ సీఎం.. యోచనలో బీజేపీ అధిష్టానం!

delhi cm

Woman As Delhi CM | ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) బీజేపీ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాలను దక్కించుకుని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది.

ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) 22 స్థానాలతో ప్రతిపక్షంలో నిలిచింది. అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 2 రోజులు గడిచినా.. ఇంకా సీఎం ఎంపికపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈనెల 13 తర్వాతే ఢిల్లీ సీఎం ఎవరనేది స్పష్టం కానుంది.

తొలుత కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ పేరు వినిపించింది. తాజాగా ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి కావొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. మహిళ సీఎంతోపాటు, బలహీన వర్గాల నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

48 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మహిళలు ఉన్నారు. రేఖా గుప్తా, శిఖా రాయ్, పూనమ్ శర్మ, నీలం పెహల్వాడ్. వీరిలో ఒకరికి ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని.. బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions