Bill Gates In Andhrapradesh | మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. ఇక్కడ హోంమంత్రి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా సచివాలయం చేరుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు. అనంతరం భేటీలో పాల్గొన్నారు.
ఆ తర్వాత ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ సందర్శించారు. వాట్సప్ గవర్నెన్స్, అవేర్ 2.0, మరియు బ్లాక్ చెయిన్ ద్వారా భూ రికార్డుల భద్రత వంటి అంశాలను ఆయనకు వివరించారు సీఎం. టెక్నాలజీలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని “గ్రేట్ వర్క్” అని బిల్ గేట్స్ కొనియాడారు.










