India England Test Series | సచిన్ – అండర్సన్ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ (India), ఇంగ్లాండ్ (England) జట్ల మధ్య లండన్ లోని ఓవల్ వేదికగా గురువారం నుంచి ఐదో టెస్ట్ ప్రారంభకానుంది. 5 టెస్టుల ఈ సిరీస్ లో ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లాడ్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది.
ఈ ఐదో టెస్టు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది. దీంతో భారత జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ టీం కు బిగ్ షాక్ తగిలింది. ఈ సిరీస్ అత్యధిక వికెట్లు తీసి, ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర వహించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు.
కుడి భుజం గాయం కారణంగా ఐదో టెస్టులో స్టోక్స్ ఆడటం లేదని ఈసీబీ ప్రకటించింది. ఈ మేరకు చివరి టెస్ట్ తుది జట్టును బుధవారం ప్రకటించింది. స్టోక్స్ స్థానంలో ఇంగ్లండ్ టీం కెప్టెన్ గా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ ఓలీ పోప్ బాధ్యతలు తీసుకోనున్నాడు. జట్టులోకి కొత్తగా జాకబ్ బెథెల్, గన్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్ చేరారు.










