Balakrishna Meets CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా అఖండ త్రిశూలాన్ని సీఎంకు బహుకరించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘అఖండ-2 తాండవం’ డిసెంబర్ ఐదున విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ క్రమంలో మూవీ టీం భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆదివారం యూపీ సీఎం యోగిని కలిసింది అఖండ టీం. ఈ సందర్భంగా సినిమా కథను సీఎంకు వివరించారు బోయపాటి. అలాగే సినిమాలోని కొన్ని ప్రత్యేక సీన్లను సీఎం యోగికి చూపించారు. సనాతన ధర్మ గొప్పతనం, సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించే సినిమాలు అవసరం అని యోగి నొక్కిచెప్పారు.
అఖండ-2 టీం గొప్పగా పనిచేసిందని, సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని ఆయన అభినందించారు. అనంతరం యోగికి అఖండ-2 లో కథానాయకుడు వినియోగించిన త్రిశూలాన్ని బహుకరించారు బాలయ్య. యోగితో భేటీ అద్భుతంగా జరిగినట్లు సంతోషం వ్యక్తం చేశారు.










