Wednesday 18th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!

ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!

CM Chandrababu’s E-Cycle Rally at Kuppam | ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ-సైకిల్ ను నడిపిస్తూ సుమారు 3 కి.మీ ప్రయాణించారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రెండవ రోజు పర్యటనలో భాగంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు ఈ సైకిల్ పంపిణీ చేశారు. ఇ-మోటరాడ్ అనే సంస్థ తయారు చేసిన ఈ ఈ-సైకిళ్లను 24 గంటల వ్యవధిలో 5,555 మంది లబ్ధిదారులకు అందజేశారు. భారీ స్థాయిలో ఈ-సైకిళ్లను పంపిణీ చేసి చిత్తూరు జిల్లా గిన్నీస్ రికార్డును సృష్టించింది.

ఈ మేరకు గిన్నీస్ ప్రతినిధులు ప్రకటించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు సీఎం. ఈ నేపథ్యంలో కొందరు ఈ సైకిళ్ల లబ్ధిదారులతో కలిసి శాంతిపురం మండలం శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో ఈ-సైకిల్ ను నడిపి చంద్రబాబు సందడి చేశారు. పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ సైకిళ్లను పంపిణీ చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ -సైకిళ్లను కుప్పంలోని యూనిట్ లో అసెంబ్లింగ్ చేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions