Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జూదం, పందెం భోగి మంటల్లో కలాలి..సంప్రదాయం వెలగాలి

జూదం, పందెం భోగి మంటల్లో కలాలి..సంప్రదాయం వెలగాలి

Deputy CM Pawan Kalyan About Sankranthi Festival | జూదాలు, పందెం భోగిమంటల్లో కాలాలి.. ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి అని పిలుపునిచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భావి తరాలకు సంక్రాంతి గొప్పదనాన్ని తెలిపేలా పండుగ చేసుకుందామని పేర్కొన్నారు. సంక్రాంతి ఉత్సవాలకు పిఠాపురం చిరునామా కావాలన్నారు. ఈ మేరకు శుక్రవారం పిఠాపురంలో “పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను” ప్రారంభించి, ప్రసంగించారు.

మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో… అదే విధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి అనేది ప్రత్యేకంగా ఒక మతానికి నిర్దేశించిన పండుగ కాదని, మన సనాతన ధర్మ మూలాల్లో చెప్పే ప్రకృతి ఆరాధన పండుగ అన్నారు. మూలలను, గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలను కాదని అన్నారు. మన మూలలను మనం మరిచిపోతే సంస్కృతి దారి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతి నుంచి… కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి అనే మాటలు పోవాలని, శ్రమైక జీవన సౌందర్యానికి సంక్రాంతి వేదిక కావాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions