Wednesday 4th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రూ. 500 నోట్లపై సోషల్ మీడియాలోప్రచారం.. క్లారిటీ ఇచ్చిన పీఐబీ!

రూ. 500 నోట్లపై సోషల్ మీడియాలోప్రచారం.. క్లారిటీ ఇచ్చిన పీఐబీ!

pib fact check

PIB Factcheck On Rs. 500 Note | కొద్ది రోజుల నుంచి 500 రూపాయల నోటుపై ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

‘ఈ ఏడాది మార్చి నుంచి ఏటీఎంలలో 500 రూపాయల నోట్ల కనిపించవు. ఎందుకంటే ఆర్బీఐ ఈ నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంది’ అంటూ ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ వైరల్ వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. 500 రూపాయల నోట్లపై జరుగుతున్న ప్రచారం ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. రూ. 500 కరెన్సీ నోట్లపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది.

ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దనీ, ప్రజలు ఈ నోట్లపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. రూ. 500 నోట్లను యథావిధిగా వినియోగించుకోవచ్చని తెలిపింది.

You may also like
ttd
తిరుమల క్యూ లైన్ లో ఫైట్..స్పందించిన టీటీడీ!
pawan babu mohan trust and kbk hospital health camp
‘కేబీకే హాస్పిటల్స్ – పవన్ బాబూ మోహన్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్!
వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions