Saturday 19th September 2026
12:07:03 PM
Home > తాజా > తొలి తెలుగు గాయని కన్నుమూత

తొలి తెలుగు గాయని కన్నుమూత

Bala Saraswathi Death News | తెలుగు చలనచిత్ర రంగం తొలి నేపథ్య గాయని, నటి రావు బాలసరస్వతి తుదిశ్వాస విడిచారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి 97 సంవత్సరాల వయసులో బుధవారం ఉదయం కన్నుమూశారు.

ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. 1928లో సరస్వతి దేవి జన్మించారు. ఆరేళ్ళ వయసు నుండే పాడడం ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో కలిపి 2 వేలకు పైగా పాటలు పాడారు. చిన్నప్పటి నుండె పాటలు పడడంతో ఆమెను అందరూ బాల సరస్వతి అని పిలిచేవారు.

ఈ పేరే ప్రాచుర్యం పొందింది. ‘సతీ అనసూయ ధ్రువ విజయం’ సినిమాలో బాల నటిగా కనిపించారు. తొలి తెలుగు గ్రామ్ ఫోన్ రికార్డు కూడా ఆమెదే. వివాహం తర్వాత పాటకు దూరమయిన బాల సరస్వతి భర్త మరణాంతరం 1974లో తిరిగి పాడటం ప్రారంభించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions