Tuesday 5th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘భారత బలం-సంయమనం రెండింటినీ చూశాం’

‘భారత బలం-సంయమనం రెండింటినీ చూశాం’

PM Modi Warns Pakistan | ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జాతిని ఉద్దేశించి తొలిసారి ప్రసంగించారు.

ఈ సందర్భంగా పాకిస్థాన్ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. దేశాన్ని ప్రజల్ని రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనుకాడబోమని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదం-చర్చలు, ఉగ్రవాదం-వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావని, ఒకేచోట నీళ్లు-రక్తం పారలేవని పేర్కొన్నారు.

“భారతదేశం ప్రతిదాడికి సమాధానం ఇచ్చిన తర్వాత, పాకిస్తాన్ తప్పించుకునే మార్గాలు వెతకడం ప్రారంభించింది. ఉద్రిక్తతలు తగ్గించాలంటూ ప్రపంచం ముందు విజ్ఞప్తి చేయడం మొదలుపెట్టింది. తీవ్ర ఎదురు దాడి కారణంగా గాయపడిన పాకిస్తాన్ సైన్యం, మే 10 మధ్యాహ్నం సమయంలో మన డీజీఎంఓను సంప్రదించింది. అప్పటికే మన దేశం ఉగ్రవాద నిర్మాణాలను భారీగా ధ్వంసం చేసి, ఉగ్రవాదులను చంపేసింది.” అని మోదీ తెలిపారు.

‘గడిచిన గత కొద్ది రోజులలో.. మన దేశానికి ఉన్న బలం – సంయమనం రెండింటినీ చూశాము. ప్రప్రథమంగా.. భారత దేశం రక్షణలో అత్యంత సాహసమైన, ధైర్యవంతమైన ముఖ్యమైన సేవలు అందించినందుకు, ప్రతి భారతీయుడి తరపున, భారతదేశపు సాయుధ దళాలకు, మన నిఘా సంస్థలకు, మన శాస్త్రవేత్తలకు నా వందనాలు. OperationSindoor లక్ష్యాన్ని సాధించడంలో మన వీర శూర సైనికులు అపారమైన ధైర్య – సాహసాలు ప్రదర్శించారు. ఈరోజు, నేను వారి ధైర్యాన్ని, పరాక్రమాన్ని మన దేశంలోని ప్రతి తల్లి, సోదరి మరియు బిడ్డలకు అంకితం చేస్తున్నాను.’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions