Tuesday 20th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘శ్రీరామనవమి..పంబన్ బ్రిడ్జి జాతికి అంకితం చేసిన ప్రధాని’

‘శ్రీరామనవమి..పంబన్ బ్రిడ్జి జాతికి అంకితం చేసిన ప్రధాని’

PM Modi inaugurates India’s first vertical lift sea bridge | తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని శ్రీరామనవమి సందర్భంగా జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. శ్రీలంక పర్యటన అనంతరం ప్రధాని ఈ బ్రిడ్జిని ప్రారంభించారు.

తమిళనాడులోని రామేశ్వరంను భారత ప్రధాన భూభాగంతో ఈ బ్రిడ్జి అనుసంధానం చేయనుంది. దీనిని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. పంబన్ బ్రిడ్జి 2.08 కి.మీ. పొడవుతో దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనగా నిలిచింది.

బ్రిడ్జి దిగువన ఓడల రాకపోకలకు ఈ వర్టికల్ లిఫ్ట్ ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రామేశ్వరం-తాంబరం ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అలాగే వంతెన కింద నుండి కోస్ట్ గార్డ్ ఓడను కూడా ఆరంభించారు.

ఈ వంతెనలోని 72.5 మీటర్ల వర్టికల్ లిఫ్ట్ 17 మీటర్ల ఎత్తుకు వెళ్లి ఓడల రాకపోకలకు అనుమతినిస్తుంది. 2019 మార్చి 1న ప్రధాని ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తి చేసింది.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions