Friday 22nd August 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జామ్ నగర్-ద్వారక..అనంత్ అంబానీ పాదయాత్ర

జామ్ నగర్-ద్వారక..అనంత్ అంబానీ పాదయాత్ర

Anant Ambani embarks on ‘Padyatra’ from Jamnagar to Dwarkadhish Temple | రిలయన్స్ అధినేత, ఆసియలోనే అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర చేపట్టారు.

గుజరాత్ జామ్ నగర్ నుండి ద్వారక వరకు సుమారు 140 కి.మీ. ఈ పాదయాత్ర కొనసాగనుంది. మార్చి 28న పాదయాత్ర ను ప్రారంభించిన అంబానీ రోజుకు 10కి.మీ. నుంచి 12 కి.మీ. వరకు నడుస్తున్నారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ 30వ పుట్టిన రోజును ద్వారకలో జరుపుకోనున్నారు.

తాను ఏ పని మొదలుపెట్టాలనుకున్నా మొదట ద్వారకాదీశుడిని ప్రార్థిస్తానని అనంత్ చెప్పారు. అనంత్ అంబానీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే వేసవి కావడంతో ఉదయం పూట విశ్రాంతి తీసుకుంటున్న అంబానీ రాత్రి వేళల్లో మాత్రమే నడుస్తున్నారు.

ఏప్రిల్ 1 వరకు ఐదు రోజులు దిగ్విజయంగా పాదయాత్ర చేపట్టినట్లు, ద్వారకను చేరుకోవడానికి మరో రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని అనంత్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా అనంత్ అంబానీకి ద్వారక శ్రీకృష్ణుడిపై అపార నమ్మకం.

ఈ నేపథ్యంలో యువత తాము సాధించే లక్ష్యాలను చేరుకోవాలంటే ద్వారకాదీశుడ్ని ప్రార్ధించాలని సూచించారు. కాగా గతేడాది అనంత్ అంబానీకి రాధిక మర్చంట్ తో వివాహం జరిగిన విషయం తెల్సిందే.

You may also like
hydraa saves rs 400 crores value government property
రూ. 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
online games
ఆన్ లైన్ మనీ గేమ్స్ ఇక నేరమే.. ఉల్లంఘిస్తే భారీగా శిక్షలు!
aishwarya rai
సోషల్ మీడియాపై ఐశ్వర్యారాయ్ సంచలన వ్యాఖ్యలు!  
justice sudershan reddy
ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions