Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > నయనతారపై కోర్టు మెట్లెక్కిన ధనుష్

నయనతారపై కోర్టు మెట్లెక్కిన ధనుష్

Dhanush Sues Nayanthara Before Madras Court | కోలీవుడ్ ( Kollywood ) లో నటి నయనతార మరియు నటుడు ధనుష్ మధ్య మొదలైన వివాదం కోర్టుకు చేరింది. నయనతార, ఆమె భర్త దర్శకుడు విగ్నేష్ ( Director Vignesh ) పై మద్రాస్ హైకోర్టులో ధనుష్ దావా వేశారు.

నయనతార జీవితం ఆధారంగా ‘ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ ‘ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ ( Netflix ) లో విడుదలైన విషయం తెల్సిందే. అయితే తన పేర్మిషన్ లేకుండా నానుమ్ రౌడీ దాన్ మూవీ విజువల్స్ ను వాడుకోవడం పట్ల ధనుష్ నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

నయనతార, విఘ్నేష్ మరియు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ ( Rowdy Pictures ) పై దావా వేశారు. బుధవారం పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం, విచారణకు అంగీకరించింది. కాగా నానుమ్ రౌడీ దాన్ మూవీ షూటింగ్ ( Shooting ) సమయంలోనే తొలిసారి నయనతార, విఘ్నేష్ కలుసుకున్నారు.

ఈ క్రమంలో తమకు ఎంతో ప్రత్యేకం అయిన నానుమ్ రౌడీ దాన్ మూవీ విజువల్స్ ను డాక్యుమెంటరీలో చూపించేందుకు పర్మిషన్ అడిగినా మూవీ నిర్మాత ధనుష్ అంగీకరించలేదని నయనతార ఒక బహిరంగ లేఖను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్ పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions