Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మి టికెట్ ఇదే!

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మి టికెట్ ఇదే!

mahalaxmi ticket

Mahalxmi Ticket | సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండు నూతన పథకాలను ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం, శాసనసభ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఇతర మంత్రులు ఈ పథకాలను ప్రారంభించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, చేయూత పథకం కింద ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల ఉచిత వైద్యం స్కీమ్స్ ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు. కాగా ” ఉచిత ప్రయాణ టికెట్ చార్జీ రూ.0.00, మహిళా సాధికారత దిశగా తొలి అడుగు” అని ఫ్రీ టికెట్ పై ముద్రించారు. ఇదే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున బాక్సర్ నిఖత్ జరీన్ కు రూ. 2 కోట్ల చెక్ ను అందజేశారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions