Friday 20th March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడే ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వసనీయత

ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడే ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వసనీయత

People trust the government only when it fulfills its promises

జగిత్యాల : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌ కుమార్‌ అన్నారు. గురువారం రాయికల్ పట్టణంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులకు వరి ధాన్యనికి క్వింటాలకు రూ.500 బోనస్ చెల్లించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఎంఎస్‌పీ కింద కింద ప్రతి పంటకు క్వింటాలకు రూ.500 బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే పేదింటి ఆడ పిల్లల వివాహాలకు లక్ష రూపాయలు, తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడే ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వసనీయత ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions