15 dead as Transformer Explode | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.
ఈ ఘటన చమోలీలోని అలకనంద (Alakananda) నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
నమామీ గంగ (Namami Ganga) ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఉన్న వంతెనకు విద్యుత్తు ప్రవాహం జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
ట్రాన్స్ ఫార్మర్ పేలడం వల్ల వంతెన రెయిలింగ్ కరెంట్ ప్రవహించి ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
ప్రమాదంలో ఒక పోలీసు అధికారి సహా పదిహేను మంది వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మొదట ఓ వాచ్మెన్ విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు గ్రామం నుంచి పోలీసులకు సమాచారం అందింది.
పోలీసు సిబ్బంది గ్రామస్థులతో పంచనామా కోసం వెళ్ళినప్పుడు చాలా మంది విద్యుదాఘాతానికి గురయ్యారు.
“ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ మరియు ఐదుగురు హోంగార్డులతో సహా దాదాపు 15 మంది మరణించారు. దర్యాప్తు జరుగుతోంది.
రైలింగ్లో కరెంట్ ఉందని ప్రాథమికంగా వెల్లడైంది మరియు దర్యాప్తు తదుపరి వివరాలను వెల్లడిస్తుంది,” ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మీడియాకి తెలిపారు.
విచారణకు ఆదేశించిన సీఎం..
ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో పిప్పల్కోటి ఔట్పోస్టు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
“ఇది చాలా దురదృష్టకర సంఘటన. పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ మరియు రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి.
ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్ రిషికేశ్కు తరలిస్తున్నామని, మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.
ఈ దుర్ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.