Monday 12th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > గర్వపడేలా చేశావ్..కుమార్తెపై జగన్ ఎమోషనల్ పోస్ట్

గర్వపడేలా చేశావ్..కుమార్తెపై జగన్ ఎమోషనల్ పోస్ట్

YS Jagan congratulated his daughter Varsha Reddy | తన కుమార్తె సాధించిన ఘనతపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ( Ys Jagan ) ఎమోషనల్ పోస్ట్ చేశారు.

లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ ( King’s College London ) నుంచి ఎంఎస్సీ ఫైనాన్స్ ( MSc Finance ) పట్టా పుచ్చుకున్న జగన్ కుమార్తె వర్షారెడ్డి. ఈ క్రమంలో జగన్ కుమార్తెకు అభినందనలు తెలిపారు. డిస్టింక్షన్‌లో పాసై తమను గర్వపడేలా చేశావని ఆనందం వ్యక్తం చేశారు.

‘గాడ్ బ్లెస్ యూ’ ( God Bless You ) అని దీవిస్తూ భార్య భారతి ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో జగన్ కుమార్తెకు పలువురు రాజకీయ నాయకులు అభినందనలు తెలుపుతున్నారు.

కాగా, జగన్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఈ నెల 16న జరిగిన కుమార్తె డిగ్రీ స్నాతకోత్సవంలో సతీమణి భారతితో కలిసి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా లండన్ నుండి వచ్చాక జగన్ జిల్లాల పర్యాటక చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

You may also like
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు
‘ఆడవారి సింధూరాన్ని తుడిచారు..అందుకే’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions