Viral Video Shows Biker Riding Recklessly Moments Before Andhra Bus Tragedy | కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఉన్న జాతీయ రహదారి 44పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. అనంతరం చెలరేగిన మంటల కారణంగా మొత్తం 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అవ్వడం అందర్నీ కలిచివేసింది.
అయితే ఈ ప్రమాదానికి కారణం ఓ బైక్ అని తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన శివశంకర్ అనే వ్యక్తి హైవే పై బైక్ పై వెళ్తున్నాడు. ఇదే సమయంలో బస్సు బైక్ ను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన శివశంకర్ మృతిచెందగా, అతడి బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుని వెళ్ళింది. అనంతరం పెట్రోల్ లీక్ అవ్వడం మూలంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రమాదానికంటే ముందు శివశంకర్ ఓ పెట్రోల్ బంక్ కు వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. పెట్రోల్ బంక్ కు వెళ్లిన శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.










