Vijay Devarakonda Appears Before ED in Illegal Betting App Case Telangana | తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండ మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.
చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేసినందుకు గాను టాలీవుడ్ సెలబ్రెటీలపై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజును ఈడీ అధికారులు ప్రశ్నించారు. తాజగా విజయ్ దేవరకొండను విచారిస్తున్నారు.
బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేసినందుకు తీసుకున్న పారితోషకం, కమీషన్లపై ఆరా తీస్తున్నారు. ఆగస్ట్ 11న విచారణకు రావాలని రానాకు, 13 న విచారణకు రావాలని మంచు లక్ష్మీకి ఈడీ నోటీసులు పంపిన విషయం తెల్సిందే.










