Saturday 7th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రైలు పట్టాలపై PUBG..ముగ్గురు యువకుల దుర్మరణం

రైలు పట్టాలపై PUBG..ముగ్గురు యువకుల దుర్మరణం

Trains Runs Over Three Teens Playing PUBG On Railway Track In Bihar | రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ( PUBG ) ఆడుతూ పరధ్యానంగా ఉండడం వల్ల ముగ్గురు యువకులు తమ ప్రాణాల్ని కోల్పోయారు.

ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పశ్చిమ చంపారన్ ( Wesr Champaran ) జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్-ముజఫర్పూర్ ( Narkatiaganj-Muzaffarpur ) మార్గంలోని పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతున్నారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన రైలు వారిని ఢీ కొట్టి పైనుండి దూసుకెళ్లింది.

పబ్జీ ఆడుతూ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మూలంగా యువకులు తమవైపు వస్తున్న రైలును గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

మృతులను ఫర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉన్న సమయంలో పరధ్యానంగా ఉండకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

You may also like
TG సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి నెలకు రెండుసార్లు..!
chenab railway bridge
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’
sharmishta
ట్రెండింగ్ లో #ReleaseSharmistha కారణం ఏంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions