Trains Runs Over Three Teens Playing PUBG On Railway Track In Bihar | రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ( PUBG ) ఆడుతూ పరధ్యానంగా ఉండడం వల్ల ముగ్గురు యువకులు తమ ప్రాణాల్ని కోల్పోయారు.
ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పశ్చిమ చంపారన్ ( Wesr Champaran ) జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్-ముజఫర్పూర్ ( Narkatiaganj-Muzaffarpur ) మార్గంలోని పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతున్నారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన రైలు వారిని ఢీ కొట్టి పైనుండి దూసుకెళ్లింది.
పబ్జీ ఆడుతూ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మూలంగా యువకులు తమవైపు వస్తున్న రైలును గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
మృతులను ఫర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉన్న సమయంలో పరధ్యానంగా ఉండకూడదని పోలీసులు సూచిస్తున్నారు.