Engineering Fee In Telangana | తెలంగాణ రాష్ట్రంలోని 160 ఇంజినీరింగ్ కాలేజీ (Engineering Fee) లకు కొత్త ట్యూషన్ ఫీజులను నిర్ధారిస్తూ ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ఈ కొత్త ఫీజులు 2025-26 నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరాల బ్లాక్ పీరియడ్కు వర్తిస్తాయి.
ఈ విద్యా సంవత్సరాల్లో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరినవారికి ఈ కొత్త ఫీజులు వర్తిస్తాయి. ఆయా స్టూడెంట్స్ నాలుగేళ్లపాటు అవే జీజులు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 33 ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ.లక్షకు పైగా.. రెండు కాలేజీలకు రూ.లక్షగా ఫీజును నిర్ణయించారు.
అత్యధికంగా సీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీకి ఫీజు రూ.1.83 లక్షలుగా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. రూ.1.75 లక్షలతో వాసవి కాలేజీ రెండో స్థానంలో నిలిచింది. 70 కాలేజీలకు ఒక్క రూపాయి కూడా పెంచకుండా సర్కార్కు సిఫార్సు చేసింది.
21 కాలేజీలకు కనీస ఫీజు రూ.45 వేలు గా నిర్ణయించారు. ఈ మేరకు ఆ సిఫార్సుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కొత్త ట్యూషన్ ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమల్లోకి వస్తాయి.










