Supreme Court On Group 1 Exam | సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 ( G.o. no. 29 )ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ ( Petition ) దాఖలు చేశారు. అంతేకాకుండా తీర్పు వచ్చేవరకు పరీక్ష వాయిదా వేయాలని కోరారు.
కాగా సోమవారం ఈ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.పిటిషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ( Kapil Sibal ) వాదనలు వినిపించారు.
అయితే ఇప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో ఉన్నారని ఇలాంటి సమయంలో గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ పై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా నిరాకరించింది.
కానీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలకు ముందే హైకోర్టు ( Telangana High Court )లో గ్రూప్ 1 కేసు విచారణను ముగించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.