Tuesday 17th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఆసీస్ గడ్డపై కోహ్లీకి ఇదే చివరి సిరీస్ : సౌరబ్ గంగూలీ

ఆసీస్ గడ్డపై కోహ్లీకి ఇదే చివరి సిరీస్ : సౌరబ్ గంగూలీ

Sourav Ganguly Backs Virat Kohli | టీం ఇండియా ( Team India ) రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ.

సొంతగడ్డపై న్యూజీలాండ్ ( New Zealand ) తో జరిగిన టెస్టు సిరీస్ లో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. అలాగే ఈ ఏడాది ఆడిన 12 టెస్టు ఇన్నింగ్స్ లో కేవలం 250 పరుగులే చేసాడు. దింతో కోహ్లీ ఫార్మ్ ( Form ) పై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలో కోహ్లీకి అండగా గంగూలీ నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరగబోయే బోర్డర్-గావస్కర్ ( Border-Gavaskar ) ట్రోఫీ కోహ్లీకి మంచి అవకాశమన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై 13 టెస్టుల్లో 6 సెంచరీలతో కోహ్లీ 1352 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీకి మంచి రికార్డ్ ( Record ) ఉందని గంగూలీ పేర్కొన్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ లో కోహ్లీ తిరిగి ఫార్మ్ లోకి వస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ ఆడబోయే చివరి టెస్టు సిరీస్ ఇదే అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions