Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > SLBC టన్నెల్ లో ఎనమిది మంది..కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

SLBC టన్నెల్ లో ఎనమిది మంది..కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

SLBC Tunnel Collapse News | నాగర్ కర్నూల్ జిల్లా ధోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఎనమిది మంది చిక్కుకున్న విషయం తెల్సిందే.

ఈ దుర్ఘటనలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు టన్నెల్ లో చిక్కుకున్నారు. వారిని రెస్క్యూ చేసేందుకు ఆపరేషన్ కొనసాగుతుంది. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మి, రీజినల్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. సైనిక బృందలాతో పాటు మంత్రి జూపల్లి కూడా టన్నెల్ లోనికి వెళ్లారు.

సొరంగ మార్గంలో 13.5 కి.మీ. లోపలికి వెళ్లగా మరో అర కి.మీ. వెళ్ళాల్సివుండగా కూలిన మట్టి, నీరుతో వారికి ఆటంకం ఎదురైంది. ప్రస్తుతం వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు ఉన్నాయి.

You may also like
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి
కేసీఆర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు..కేటీఆర్ కన్నెర్ర
బంగారం, వెండి ధరలు పతనానికి కారణం ఈయనే!
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions