Tuesday 3rd June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వారానికి 40 గంటలే పని..చట్టం తేవాలి

వారానికి 40 గంటలే పని..చట్టం తేవాలి

Shashi Tharoor On Working Hours | యర్నేస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ( Ernst And Young India ) లో పనిచేస్తున్న కోచికి చెందిన అన్నా సెబాస్టియన్ ( Anna Sebastian ) పని ఒత్తిడి కారణంగా మరణించిన విషయం తెల్సిందే.

చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న 26 ఏళ్ల సెబాస్టియన్ గత నాలుగు నెలలుగా రోజుకు 14 గంటల పాటు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేశారు. ఈ క్రమంలో జులై 20న పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకులారు.

ఈ నేపథ్యంలో పని గంటలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీ శశిథరూర్ ( Shashi Tharoor ) స్పందించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో రోజుకు 8 గంటలు, వారానికి ఐదు రోజులు మించి ఉద్యోగులతో పని చేయించకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ఫిక్స్ద్ క్యాలెండర్ ఉండాలని సూచించారు.

కంపెనీలు అమానవీయ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు, జరిమానా విధించే విధంగా చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. మానవహక్కులను అడ్డుకోకూడదన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు శశిథరూర్ చెప్పారు.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions