Pro-Pakistan handles claim Indian woman pilot captured | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మహిళా పైలట్ ను పాకిస్థాన్ ఆర్మి అదుపులోకి తీసుకుందని ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫాక్ట్ చెక్ స్పష్టం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ మరోసారి భారత్ పై దాడికి యత్నించింది. పౌరులు, ప్రార్ధనా మందిరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేయడం ఆ దేశ వక్రబుద్దిని సూచిస్తుంది.
ఇదే సమయంలో దాయాధి దేశం సోషల్ మీడియాలో ఫెక్ వార్తలను తెగ ట్రెండ్ చేస్తోంది. భారత పౌరుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలనే కుట్రలో భాగంగానే ఇలా చేస్తుందిఇదే సమయంలో దాయాధి దేశం సోషల్ మీడియాలో ఫెక్ వార్తలను తెగ ట్రెండ్ చేస్తోంది. భారత పౌరుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలనే కుట్రలో భాగంగానే ఇలా చేస్తుంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మహిళా పైలట్ పాకిస్థాన్ లో పట్టుబడినట్లు ఒక ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టింది.
అభినందన్ తర్వాత మరో భారత పైలట్ తమకు చిక్కినట్లు పాక్ లోని కొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఫేక్ ప్రచారంపై పీఐబీ స్పందించింది. భారత ఎయిర్ ఫోర్స్ పైలట్ పాక్ లో చిక్కలేదని, ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని పీఐబీ ఫాక్ట్ చేసింది. పాకిస్థాన్ అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని పీఐబీ ఖండించింది.