Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నిరాహార దీక్ష..వేదిక పక్కనే లగ్జరీ వ్యాన్

నిరాహార దీక్ష..వేదిక పక్కనే లగ్జరీ వ్యాన్

Prashant Kishore Latest News | బీహార్ ( Bihar )లో జన్ సురాజ్ పార్టీ ( Jan Suraaj Party )ని స్థాపించి జనాల్లోకి వెళ్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజగా విమర్శల పాలవుతున్నారు.

ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ ( Preliminary ) పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. పరీక్ష అభ్యర్థులు సైతం రోడ్డెక్కారు. ఈ క్రమంలో పరీక్షను రద్దు చేసి, కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

పట్నాలోని గాంధీ మైదాన్ ( Gandhi Maidan ) లో మహాత్ముడి విగ్రహం ముందు ఆయన నిరశన చేస్తున్నారు. అయితే వేదిక పక్కనే ఓ లగ్జరీ వ్యాన్ దర్శనమిచ్చింది. అది ప్రశాంత్ కిషోర్ కు చెందిందే. అందులో ఏసీ, కిచెన్ ( Kitchen ), బెడ్రూం ( Bedroom ) వంటి సదుపాయాలు ఉన్నాయి.

దీనిపై రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో లగ్జరీ వ్యాన్ ( Luxury Van ) పై కాదు, పట్టించుకోవాల్సింది విద్యార్థుల భవిష్యత్ గురించి అంటూ జన్ సురాజ్ పార్టీ ప్రతినిధులు స్పందిస్తున్నారు.

You may also like
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions