Saturday 21st September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల లడ్డూ వివాదం..పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

తిరుమల లడ్డూ వివాదం..పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

Prakash Raj Counter To Pawan Kalyan | తిరుమల ( Tirumala )శ్రీవారి లడ్డూలో జంతుకొవ్వు ( Animal Fat )ను వినియోగించారని వస్తున్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. లడ్డూలో జంతుకొవ్వును వాడారనే అంశం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు పవన్. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ( TTD Board ) ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని డిప్యూటీ సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ‘ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మీరు ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. విచారణ చేసి నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించండి. కానీ, మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు మరియు సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు…కేంద్రంలో ఉన్న మీ స్నేహితుల మూలంగా దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. ‘ అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

You may also like
లడ్డూ వివాదం..టీటీడీకి తెలంగాణ విజయ డెయిరీ ఆఫర్
శ్రీవారి లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ వివాదం..కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions