Sunday 8th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సమ్మక్క-సారక్క పరాక్రమాన్నిగుర్తుచేసుకుందాం: ప్రధాని మోదీ

సమ్మక్క-సారక్క పరాక్రమాన్నిగుర్తుచేసుకుందాం: ప్రధాని మోదీ

PM Modi

Pm Modi On Medaram Jathara| ప్రతి రెండేండ్లకు ఒకసారి జరిగే మేడారం ( Medaram ) సమ్మక్క సారక్క ( Sammakka-Sarakka ) ల జాతర బుధవారం నుండి ప్రారంభం అయ్యింది.

దక్షిణ భారత కుంభమేళా ( Kumbhamela )గా పేరొందిన మేడారం జాతరలో వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

బుధవారం నుండి మొదలుకొని, నాలుగు రోజుల పాటు ఈ జాతర ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం జాతర ప్రారంభం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ ( Pm Modi ).

” గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం.” అని తెలిపారు మోదీ.

ఈ మేరకు ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
TGSPDCL FIELD WORKERS
జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!
తెలుగురాష్ట్రాల్లో వరదలు..చిరంజీవి మనవి
భారీ వర్షాలు..ఇంటిముందు దర్శనమిచ్చిన 15 అడుగుల మొసలి
husband second marriage
భర్తకి రెండో పెళ్లి చేసిన భార్య.. కారణమేంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions