PM Modi Israel visit | భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సాయంత్రం ఇజ్రాయెల్ దేశం చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని అక్కడకు వెళ్లారు. బుధవారం సాయంత్రం టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ లో ప్రధాని విమానం ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దంపతులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ‘ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకి స్వాగతం’ అని నెతన్యాహు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారం పెంపొందించడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన కొనసాగనుంది.
ఇకపోతే ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇప్పటివరకు ఏ భారత ప్రధానమంత్రి కూడా ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించలేదు. ఇలా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రధాని మోదీ రెండవ సారి ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తున్నారు. 2017లో ఆయన తొలిసారి ఆ దేశంలో పర్యటించారు.










