PM Modi captures glimpse of Ram Setu while returning from Sri Lanka | శ్రీలంక పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగివస్తున్న ప్రధాని నరేంద్రమోదీ రామసేతును విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
‘కొద్దిసేపటి క్రితం శ్రీలంక నుండి తిరిగి వస్తుండగా, రామసేతు దర్శనం చేసుకునే అదృష్టం నాకు కలిగింది. మరియు, దైవిక యాదృచ్చికంగా, అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే ఇది జరిగింది. రెండిటి దర్శనం చేసుకునే అదృష్టం నాకు లభించింది. ప్రభు శ్రీరాముడు మనందరినీ ఐక్యం చేసే శక్తి. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలి’ అని ప్రధాని పేర్కొన్నారు.
అనంతరం తమిళనాడులో రామేశ్వరంను భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసే పంబన్ బ్రిడ్జి ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.